భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (RO-KO) కి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో వీరిద్దరినీ ఏ ప్లస్ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్కు డిమోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గనుంది.
Read Also: U19 World Cup: విజేత జట్టుకు రూ.7.5 కోట్ల భారీ నగదు
ప్రపంచ కప్ లక్ష్యం
టి20, వన్డే, టెస్టులు ఆడేవారిని మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్లో ఉంచే నిబంధన ప్రకారం, కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లి, రోహిత్లకు ఈ కోత విధించినట్లు తెలుస్తోంది. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఇది ఊహించని పరిణామం. రోహిత్, కోహ్లీ, జడేజా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ జడేజాను మాత్రమే గ్రూప్ Aలో ఎందుకు ఉంచారనేది తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: