Latest News: BCCI: బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Read Time:  1 min
Latest News: BCCI: బీసీసీఐ నేడు కీలక సమావేశం?
FONT SIZE
GET APP

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌లతో ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. బుధవారం రాయ్‌పూర్‌లో ఈ భేటీ జరగనుందని సమాచారం. జట్టు ఎంపిక, సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత తేవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

Read Also: KL Rahul: టీమిండియా విజయం పై కెప్టెన్ రాహుల్ ఏమన్నారంటే?

దక్షిణాఫ్రికాతో బుధవారం జరగనున్న రెండో వన్డేకు ముందు ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) అద్భుత ఫామ్‌తో రాణిస్తున్నప్పటికీ, జట్టు భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నడుమ ఈ పరిణామం చోటుచేసుకుంది.

స్పోర్ట్స్‌స్టార్ కథనం ప్రకారం, ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, గంభీర్, అగార్కర్ పాల్గొననున్నారు. కొత్త బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ (Mithun Manhas) హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. మ్యాచ్ జరిగే రోజు సమావేశం నిర్వహిస్తున్నందున, సీనియర్ ఆటగాళ్లను పిలిచే అవకాశం తక్కువగా ఉంది.

BCCI holds crucial meeting today?
BCCI holds crucial meeting today?

టీ20 ప్రపంచ కప్ టైటిల్

సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయం లోపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ళ ఎంపికలో నిలకడ, అభివృద్ధిపై దృష్టి సారించాలని బీసీసీఐ (BCCI) కోరుకుంటోంది. అలాగే, వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలవడం, ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేయడంపై బోర్డు దృష్టి పెట్టింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.