हिन्दी | Epaper
ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

Latest News: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం

Anusha
Latest News: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం

ఆసియా కప్-2025 ట్రోఫీ చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. టోర్నీ ముగిసి ఆరు వారాలు గడుస్తున్నా, విజేత భారత జట్టుకు ఇంకా ట్రోఫీ అందలేదు.. ముఖ్యంగా,టోర్నీ విజేతకు ట్రోఫీ ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐ (BCCI) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Read Also: Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వారం దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ప్రవర్తనపై ఫిర్యాదు చేయనుంది.సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు,

పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని, పతకాలను స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.

అసలేం జరిగింది

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో భారత జట్టు వేచి చూస్తుండగానే నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ అసాధారణ పరిణామంపై బీసీసీఐ (BCCI) ఇప్పటికే ఏసీసీ (ACC) కి అధికారికంగా లేఖ రాసింది.

BCCI
BCCI

పది రోజుల క్రితం లేఖ పంపినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

ఐసీసీ బోర్డు సమావేశంలో ట్రోఫీ అప్పగింత

శుక్రవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశం (ICC board meeting) లో ట్రోఫీ అప్పగింత అంశాన్ని బీసీసీఐ బలంగా ప్రస్తావించనుంది.ట్రోఫీ వివాదంతో పాటు, మోసిన్ నఖ్వీ ఏకకాలంలో పీసీబీ చైర్మన్‌గా, ఏసీసీ అధ్యక్షుడిగా, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కొనసాగడంపైనా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే వ్యక్తి ప్రభుత్వ, క్రీడా పదవుల్లో ఉండటం ఐసీసీ పాలనా నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ వాదించనుంది.

ఈ విషయంలో బీసీసీఐకి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్థాన్ జరిపిన సైనిక దాడిలో తమ దేశవాళీ క్రికెటర్లు మరణించారని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్థాన్, పాక్‌తో త్రైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

టీ20 వరల్డ్ కప్‌ కు న్యూజిలాండ్ జట్టు ఇదే

టీ20 వరల్డ్ కప్‌ కు న్యూజిలాండ్ జట్టు ఇదే

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. తొలి వన్డేకు భారత్ సిద్ధం

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. తొలి వన్డేకు భారత్ సిద్ధం

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

టీ20ల్లో గిల్ పునరాగమనంపై సందేహం లేదు

టీ20ల్లో గిల్ పునరాగమనంపై సందేహం లేదు

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌.. సదర్లాండ్ నంబర్ వన్

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌.. సదర్లాండ్ నంబర్ వన్

రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్

రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్

ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్

ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్

సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే?

సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే?

ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ?

ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ?

72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు నార్పల క్రీడాకారిణి

72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు నార్పల క్రీడాకారిణి

అమరావతికి ఎంఎస్ ధోని – సీఎం చంద్రబాబుతో కీలక భేటీ

అమరావతికి ఎంఎస్ ధోని – సీఎం చంద్రబాబుతో కీలక భేటీ

📢 For Advertisement Booking: 98481 12870