T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు అనూహ్యంగా మధ్యప్రాచ్య యుద్ధ సెగ తగిలింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యల కారణంగా ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం (Red Sea) గల్ఫ్ దేశాల గగనతలంలో విమాన ప్రయాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. ఈ పరిణామాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిశితంగా గమనిస్తోంది. టోర్నీలో పాల్గొంటున్న జట్లు, అధికారుల భద్రత కోసం అప్రమత్తమైంది.
Read Also: PAK vs SL: శ్రీలంకపై పాక్ అద్భుత విజయం.. కానీ సెమీస్ కల చెదిరిన వేళ!

దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత.. ఐసీసీ అప్రమత్తం
ప్రపంచకప్ కోసం వచ్చిన జట్లు, బ్రాడ్కాస్టర్లు, మ్యాచ్ అఫిషియల్స్ టోర్నీ ముగిసిన తర్వాత తమ దేశాలకు వెళ్లడానికి దుబాయ్ విమానాశ్రయాన్ని ప్రధాన ట్రాన్సిట్ హబ్గా ఉపయోగిస్తుంటారు. అయితే, తాజా ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ విమానాశ్రయం తమ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి యూరప్, ఆఫ్రికా వెళ్లే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా అప్రమత్తమై, గగనతల మార్పులు, నిబంధనలను ఎప్పటికప్పుడు గమనించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.
దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. టోర్నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. “మేము ఇప్పటికే మా ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ బృందాలను రంగంలోకి దించాము. ఆటగాళ్లు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం” అని ఐసీసీ ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: