ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ (Asia Cup Rising Stars 2025) లో పాకిస్థాన్ షాహీన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఏ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ షాహీన్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్-ఏ.. పాకిస్థాన్ను 125 పరుగులకే ఆలౌట్ చేసింది.
Read Also: Muthusamy Record: సౌతాఫ్రికా స్టార్ ముత్తుసామి సెన్సేషనల్ బ్యాటింగ్
మూడోసారి టైటిల్ గెలిచిన ఏకైక జట్టు
బంగ్లా బౌలర్ రిపోన్ మండల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ గట్టిగా పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 125 పరుగులు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది.
సూపర్ ఓవర్లో పాక్ బౌలర్ అహ్మద్ డానియల్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ను 2 వికెట్ల నష్టానికి కేవలం 6 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం 7 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్-ఏ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్-ఏ ఈ టోర్నీ చరిత్రలో మూడోసారి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: