ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిద్ధమైంది. ఆసియా కప్ ట్రోఫీని వెంటనే తమకు అప్పగించాలంటూ బీసీసీఐ(BCCI) నఖ్వీకి తాజాగా ఒక మెయిల్ పంపింది. ట్రోఫీని ఇవ్వడానికి నిరాకరిస్తే, ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో, ఆయన ట్రోఫీని వెంట తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.
Read Also : Youth suicide : యువత ఆత్మహత్యలను అరికట్టలేమా?
ట్రోఫీని వెంట తీసుకెళ్లిన నఖ్వీ
భారత జట్టు ఫైనల్ గెలిచిన తర్వాత ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన నఖ్వీ, ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయారు. ట్రోఫీని తమకు అప్పగించాలంటూ పీసీబీ చీఫ్కు బీసీసీఐ మెయిల్ చేసింది. నఖ్వీ నుంచి స్పందన రాకపోతే, విషయాన్ని నేరుగా ఐసీసీ ఎదుటే తేల్చుకుంటామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఆసియా కప్ నిర్వహణ బాధ్యత ఏసీసీది కానీ, పీసీబీది కాదని, ట్రోఫీని అక్రమంగా తరలించడంపై చర్యలు తప్పవని బీసీసీఐ అంటోంది.
ఐసీసీలో ఫిర్యాదుకు సన్నద్ధం
ట్రోఫీని హోటల్కు తీసుకెళ్లడం నఖ్వీ చేసిన పెద్ద పొరపాటుగా బీసీసీఐ భావిస్తోంది. ఈ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఏసీసీ అధ్యక్షుడిగా ఆయనకు ఈ వైఖరి తగదని భారత బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం మొహ్సిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.
ఆసియా కప్ ట్రోఫీని తిరిగి ఇవ్వాలని బీసీసీఐ ఎవరిని కోరింది?
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీని కోరింది.
ట్రోఫీ ఇవ్వకపోతే బీసీసీఐ తీసుకోబోయే చర్య ఏమిటి?
ఐసీసీకి (ICC) అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :