हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Asia Cup 2025: మేం ఏ జట్టునైనా ఓడించగలం: పాక్ కెప్టెన్

Anusha
Latest News: Asia Cup 2025: మేం ఏ జట్టునైనా ఓడించగలం: పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)లో పాక్ జట్టు ఫైనల్‌కి అర్హత సాధించడంతో, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌పై సమీప తేడాతో వచ్చిన విజయం పాకిస్థాన్ కోసం కీలకమైనది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఆడిన రీతిని ఆయన ప్రశంసిస్తూ, ఫైనల్‌లో భారత్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తమ వద్ద ఉందని పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

PAK vs BAN: ఓటమిపై బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

బంగ్లాదేశ్‌పై స్వల్ప తేడాతో గెలుపొందడంపై మాట్లాడిన పాకిస్తాన్ కెప్టెన్.. ఫైనల్‌లో భారత్‌ను ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని పూర్తి విశ్వాసం చూపించారు.మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) మాట్లాడుతూ, “ఇలాంటి కష్టమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను గెలిచామంటే, మేం కచ్చితంగా ఒక ప్రత్యేకమైన జట్టు అయి ఉండాలి” అని అన్నారు. తమ జట్టులోని ప్రతి ఒక్కరూ బాగా ఆడారని ప్రశంసించారు.

బౌలింగ్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతమని సల్మాన్ కొనియాడారు

అయితే టోర్నమెంట్‌లో నిలకడగా లేని బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. బ్యాటింగ్‌లో కొంత మెరుగుదల అవసరం ఉందని, దానిపై మేము కచ్చితంగా పని చేస్తామని లోపాలనుఅంగీకరించారు.బౌలింగ్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతమని సల్మాన్ కొనియాడారు. ముఖ్యంగా స్టార్ పేసర్‌ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) ని అభినందిస్తూ.. “షాహీన్ ఒక అద్భుతమైన ఆటగాడు. జట్టుకు ఏది అవసరమో అతను అదే చేస్తాడు.

అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం” అని పేర్కొన్నారు. తక్కువ స్కోరు చేసినప్పటికీ, దానిని కాపాడుకోవడంపై స్పష్టత ఇచ్చారు. “మేము సుమారు 15 పరుగులు తక్కువగా చేశాం. కానీ, మేము కొత్త బంతితో బౌలింగ్ (Bowling) చేసిన తీరు చూస్తే, మేము ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాం. ఇలా బౌలింగ్ చేస్తే, చాలా సందర్భాలలో మీరు తప్పకుండా మ్యాచ్‌లు గెలుస్తారు” అని బౌలింగ్ యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

Asia Cup 2025
Asia Cup 2025

కోచ్ మైక్ హెస్సన్ ఒక విషయం స్పష్టం చేశారు

జట్టు ఫీల్డింగ్‌లో వచ్చిన మెరుగుదలకు కారణాన్ని కూడా సల్మాన్ వెల్లడించారు. “మేము బాగా ఫీల్డింగ్ చేస్తున్నాం. కోచ్ షేన్ మాపై చాలా కష్టపడుతున్నారు. మేము అదనపు సెషన్లు తీసుకుంటున్నాం. కోచ్ మైక్ హెస్సన్ (Coach Mike Hesson) ఒక విషయం స్పష్టం చేశారు – మీరు ఫీల్డింగ్ చేయలేకపోతే, జట్టులో ఉండలేరు అని. ఈ మాటలు మాకు ప్రేరణగా నిలిచాయి.” అని వివరించారు.ఆసియా కప్ 2025లో డూ ఆర్ డైమ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

దీంతో, ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మాకు ఎవరినైనా ఓడించగలిగేంత సామర్థ్యం ఉంది

అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ, బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు.చివరగా, టైటిల్ పోరుపై సల్మాన్ ధీమా వ్యక్తం చేశారు. “మాకు ఎవరినైనా ఓడించగలిగేంత సామర్థ్యం ఉంది. ఆదివారం (ఫైనల్) తిరిగి వచ్చి, అదే చేసి చూపిస్తాం” అంటూ తమ దాయాది జట్టు భారత్‌కు సవాల్ విసిరారు.పాకిస్థాన్ జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870