📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: ట్రోఫీ యూఏఈ బోర్డుకు టైటిల్ ఇచ్చేసిన పాక్ మంత్రి?

Author Icon By Aanusha
Updated: October 1, 2025 • 10:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై గెలిచి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయానంతరం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన చోటుచేసుకుంది. ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహిన్ నఖ్వీ  (Mohsin Naqvi) ఆసియా కప్ ట్రోఫీతో పాటు విజేతలకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తనవద్దే ఉంచుకున్నారు. ఈ చర్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shahid Afridi: పీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ షాహిద్ అఫ్రిది డిమాండ్

ఏసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ట్రోఫీని, మెడల్స్‌ను భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ పేర్కొన్నట్లు సమాచారం.

ఈ అంశాన్ని బీసీసీఐ, ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ట్రోఫీ చౌర్యం, నియమాలను ఉల్లంఘించినందుకు నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) చీఫ్ పదవి నుంచి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది.

Asia Cup 2025

ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు

ఈ పరిణామాల నేపథ్యంలో ఆందోళన చెందిన నఖ్వీ, ఆసియా ట్రోఫీని, మెడల్స్‌ను యూఏఈ బోర్డుకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని ఆ బోర్డు టీమిండియా (Team India) కు ఎలా అందజేస్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మంగళవారం వర్చువల్‌గా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు నఖ్వీని ప్రశ్నించారు. ఆసియా టోర్నీ కప్ టీమిండియాకు చెందుతుందని, అది వ్యక్తిగత ఆస్తి కాదని బీసీసీఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

ACC Confirmation Asia Cup 2025 BCCI Warning Breaking News India Champion latest news Medals Issue Mohsin Naqvi Pakistan Cricket Board Telugu News trophy controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.