Anil Kumble T20 World Cup : టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా స్పిన్నర్లపై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిబ్రవరి–మార్చి నెలల్లో జరగనున్న టోర్నీలో మంచు ప్రభావం కీలకంగా మారుతుందన్న చర్చల నేపథ్యంలో, భారత స్పిన్నర్లకు ఇది పెద్ద సమస్య కాదని కుంబ్లే స్పష్టం చేశాడు. తడి బంతితో బౌలింగ్ చేయడంలో వారికి ఇప్పటికే అనుభవం ఉందని చెప్పాడు.
జియోహాట్స్టార్ కార్యక్రమంలో మాట్లాడుతూ, “సాయంత్రం మ్యాచ్ల్లో మంచు ప్రభావం తప్పదు. కానీ తడి బంతితో బౌలింగ్ చేయడం భారత స్పిన్నర్లకు కొత్త కాదు. ఇలాంటి పరిస్థితులను వారు ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు” అని కుంబ్లే అన్నాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ శైలి కారణంగా అతనికి మంచుతో పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డాడు.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
“వరుణ్ బంతిని పట్టుకునే తీరు, అతని వేగం వల్ల తడి బంతితో కూడా సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అక్షర్ పటేల్కు కూడా పెద్ద సమస్య ఉండదు. కుల్దీప్ యాదవ్కు కాస్త ఇబ్బంది ఉండొచ్చు కానీ అతనికి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది” అని కుంబ్లే విశ్లేషించాడు.
జట్టు ఎంపికపై మాట్లాడుతూ, పరిస్థితులను బట్టి కాకుండా అత్యుత్తమ జట్టునే బరిలోకి దింపాలని కుంబ్లే సూచించాడు. “మంచును ఎక్కువగా ఆలోచించకుండా బెస్ట్ టీమ్ను ఆడించాలి. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతోనే వెళ్లాల్సి వస్తే, తడి పరిస్థితుల్లో కుల్దీప్ కంటే వరుణ్కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు” అని అన్నాడు.
భారత్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలపై కూడా కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. “వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్లు గెలవడం సులభం కాదు. కానీ ప్రస్తుత జట్టు ఫామ్, బలాన్ని చూస్తే భారత్ ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలదు. సెమీఫైనల్స్కు చేరడం ఖాయం, టైటిల్ గెలిచే అవకాశం కూడా ఉంది” అని పేర్కొన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: