📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది

Author Icon By Anusha
Updated: February 16, 2026 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు మరోసారి క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. కోట్లాది మంది అభిమానుల అంచనాల మధ్య సాగిన ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. టీమిండియా అద్భుతంగా ఆడిందంటూ కితాబిచ్చారు.

Read Also: Shoaib Akhtar: PCB చైర్మన్‌పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్

ప్రతి ఆటగాడు తమ పాత్రను పూర్తి చేసారు

ఫార్మాట్లు, వేదికలు, తేదీలు మారినా పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపు మాత్రం స్థిరంగా ఉంటోందని పేర్కొన్నారు. టీమిండియాకు ఆయన అభినందనలు తెలియజేశారు.పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రశాంతంగా, ధైర్యంగా భారత జట్టు అద్భుత విజయం సాధించిందని అన్నారు.

టీ20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయాలు 8-1కి చేరుకోవడం గొప్ప విషయమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.భారత జట్టు కలిసికట్టుగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. వారి ప్రదర్శన గర్వకారణమని పేర్కొన్నాడు. టీమిండియాలోని ప్రతి ఆటగాడు ప్రశాంతంగా, బలంగా తమ పాత్రను పూర్తి చేశారని ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.