हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Akash Chopra: ధోనీ ఎప్పటికీ టీమిండియా హెడ్ కోచ్ కాలేడు..కారణం ఇదే అంటున్న ఆకాశ్ చోప్రా!

Anusha
Akash Chopra: ధోనీ ఎప్పటికీ టీమిండియా హెడ్ కోచ్ కాలేడు..కారణం ఇదే అంటున్న ఆకాశ్ చోప్రా!

టీమిండియా క్రికెట్‌లో తాజాగా చర్చనీయాంశంగా మారిన విషయం హెడ్ కోచ్‌ నియామకం. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పదవీ కాలం ముగుస్తుండటంతో, తదుపరి కోచ్ ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఎక్కువైంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ధోనీ కోచ్‌గా వస్తే జట్టుకు కొత్త ఊపుని ఇస్తారని కొందరు అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాజీ క్రికెటర్‌, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు.ఆకాశ్‌ చోప్రా (Akash Chopra) అభిప్రాయ ప్రకారం, ధోనీ ఎప్పటికీ భారత జట్టు హెడ్ కోచ్ అవ్వరు. దీనికి కారణం ఆయన ప్రస్తుత జీవనశైలి, ప్రాధాన్యతలు  అందుకు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చోప్రా, “కోచింగ్ అనేది చాలా కష్టమైన ఉద్యోగం. ఆటగాడిగా ఉన్నప్పటి కన్నా కొన్నిసార్లు కోచ్‌గా మరింత బిజీగా ఉండాలి. ఆటగాడు మ్యాచ్‌లు ఆడుతాడు, మిగతా సమయం విశ్రాంతి తీసుకుంటాడు. కానీ కోచ్ ప్రతి మ్యాచ్‌లో, ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో, ప్రతి టూర్‌లో పూర్తిగా జట్టుతోనే ఉండాలి” అని అన్నారు.

Akash Chopra
Akash Chopra

కోచింగ్ అనేది చాలా కష్టమైన ఉద్యోగం

ధోనీ (Dhoni) ఇప్పటికే జీవితంలో ఎక్కువ కాలం సూట్‌కేసులతో ప్రయాణిస్తూ గడిపాడు. ఇప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఉంది. మళ్లీ అలాంటి జీవితాన్ని గడపాలని ధోనీ కోరుకోడు” అని చోప్రా అభిప్రాయపడ్డారు.చాలా మంది మాజీ ఆటగాళ్లు కేవలం రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచింగ్‌ ఇవ్వడానికి ఇష్టపడతారని, కానీ భారత జట్టుకు కోచ్‌గా ఉండటం పూర్తి భిన్నమైన వ్యవహారమని ఆయన గుర్తుచేశారు. “టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటే ఏడాదికి దాదాపు 10 నెలలు జట్టుతోనే గడపాలి. అంత సమయం కేటాయించడం చాలా కష్టం. ఒకవేళ ధోనీ అంత సమయం కేటాయించగలిగితే నేను ఆశ్చర్యపోతాను” అని ఆకాశ్ చోప్రా అన్నారు. ఈ కారణాల వల్లే ధోనీ హెడ్ కోచ్ రేసులో ఉండే అవకాశం లేదని ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు

ఆకాశ్‌ చోప్రా ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు?

ఆకాశ్‌ చోప్రా భారత జట్టుకు (Team India) ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ప్రాతినిధ్యం వహించారు. దేశీయంగా ఆయన ఢిల్లీ జట్టుకు ఆడారు.

ఆయన భారత జట్టులో ఎన్ని మ్యాచ్‌లు ఆడారు?

ఆకాశ్‌ చోప్రా 2003–2004 మధ్యకాలంలో భారత తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pakistan-team-for-asia-cup/sports/531646/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870