Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన ఫామ్పై మౌనం వీడాడు. మైదానంలో తన దూకుడైన ఆటతీరును, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోనని ఆయన స్పష్టం చేశాడు. వైఫల్యాలు ఎదురైనప్పుడే విమర్శలు రావడం సహజమని, కానీ తన శైలిని మార్చుకుంటే తన సహజ సిద్ధమైన ఆట దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

నా ఆటతీరు, మైండ్సెట్ను మార్చుకోను
స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ అభిషేక్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘బ్యాటింగ్ను నేను చాలా ఆస్వాదిస్తాను. ఒత్తిడికి గురికావడాన్ని రెండేళ్ల క్రితమే వదిలేశాను. నా చేతుల్లో ఉన్నది కేవలం సాధన చేయడమే. నా ఆటతీరు, మైండ్సెట్ను మార్చుకోను. ప్రతి బ్యాటర్ కెరీర్లో ఇలాంటి ఒడిదొడుకులు సహజం. ఫలితాలు ఎలా ఉన్నా దూకుడుగా ఆడటమే నా శైలి’ అని తేల్చిచెప్పాడు.
ప్రస్తుత టోర్నీలో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ల్లో అభిషేక్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, జట్టు యాజమాన్యంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి పూర్తి మద్దతు ప్రకటించారు. అభిషేక్పై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతడు కచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: