Aakash Chopra-IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉన్నా, బౌలింగ్ విభాగం మాత్రం అత్యంత బలహీనంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “బ్యాటర్లు కష్టపడి 250 పరుగులు చేసినా.. బౌలర్లు అంతే మొత్తంలో పరుగులు సమర్పించుకునేలా ఉన్నారు” అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also: IPL news : ‘మీ అబ్బాయి వచ్చేశాడు’.. షా ఎమోషనల్ రియాక్షన్
Aakash Chopra-IPL 2026: కీలక బౌలర్ల గైర్హాజరీతో పెరిగిన కష్టాలు
ఎస్ఆర్హెచ్ జట్టుకు ఈసారి గాయాలు, ఆటగాళ్ల గైర్హాజరీ పెద్ద సమస్యగా మారింది. కెప్టెన్ పాట్ కమిన్స్ మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం, ఈషన్ మలింగ ఫిట్నెస్ సమస్యలు జట్టును ఇబ్బందుల్లో నెట్టాయి. విదేశీ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ, అతనికి భారత పిచ్లపై పెద్దగా అనుభవం లేదని ఆకాష్ చోప్రా గుర్తుచేశారు. జట్టు మొత్తం కేవలం యువ భారతీయ బౌలర్లపైనే ఆధారపడటం రిస్క్ అని ఆయన హెచ్చరించారు.

యువ బౌలర్లకు అగ్నిపరీక్ష
జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా.. మిగిలిన బౌలర్లంతా దాదాపు కొత్తవారే. అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్, హర్ష్ దూబే వంటి యువ ఆటగాళ్లతో ఈ మెగా టోర్నీని నెట్టుకురావడం కష్టమని చోప్రా విశ్లేషించారు. ముఖ్యంగా స్పిన్ విభాగం చాలా బలహీనంగా ఉందని, ఇది ప్రత్యర్థి జట్లకు కలిసి వచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: