📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

1st T20I: ఆసీస్ పై భారత్ ఘన విజయం

Author Icon By Aanusha
Updated: February 15, 2026 • 6:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిడ్నీ వేదికగా జరిగిన తొలి T20 (1st T20I) మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది.. జార్జియో వేర్‌హమ్(19 బంతుల్లో 4 ఫోర్లతో 30), ఫోబే లిచిఫీల్డ్(19 బంతుల్లో 5 ఫోర్లతో 26), ఎల్లిస్ పెర్రీ(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే ఈ ముగ్గురిని అరుంధతి రెడ్డినే పెవిలియన్ చేర్చింది. ఆమెతో పాటు శ్రీచరణి(2/14), రేణుక సింగ్(2/14) రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, దీప్తి వర్మ చెరో వికెట్ తీసారు.

Read Also: T20 World Cup 2026: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

1st T20I: India win over Aussies

భారత్ 21 పరుగుల ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21) దూకుడుగా ఆడే క్రమంలో ఔటైనా.. స్మృతి మంధాన(17 బంతుల్లో 2 ఫోర్లతో 16), జెమీమా రోడ్రిగ్స్(3 బంతుల్లో 2 ఫోర్లతో 9 నాటౌట్) అజేయంగా నిలిచారు.వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డీఎల్‌ఎస్ పద్దతిన మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. ఈ లెక్క ప్రకారం భారత్ 21 పరుగుల ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు.

ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం కాన్‌బెర్రా వేదికగా జరగనుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత్ మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ 2025 విజయానంతరం భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సేన సిద్దమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

India women vs Australia women Sydney T20 Women’s Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.