విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త..

Read Time:  1 min
kohli virat
kohli virat
FONT SIZE
GET APP

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఒక సరికొత్త చరిత్రను సృష్టించే అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతానికైతే, ఈ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, 134 పరుగులు చేస్తే, ఈ జాబితాలో అతను అగ్రస్థానానికి చేరుకోబోతున్నాడు.సచిన్ టెండూల్కర్ ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్‌లలో మొత్తం 449 పరుగులు చేశారు.ఇది ఇప్పటివరకు ఎంసీజీపై భారత బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక రికార్డు. ఈ జాబితాలో రెండో స్థానంలో అజింక్యా రహానే ఉన్నాడు.అతను 6 ఇన్నింగ్స్‌లలో 369 పరుగులు చేసి, తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం 316 పరుగులతో మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి సచిన్ రికార్డును అధిగమించడానికి కేవలం 134 పరుగులు అవసరం.ఇది సాధ్యమైతే,ఎంసీజీ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అతను తన పేరు న‌మోదు చేసుకుంటాడు.

విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధిస్తే,మరింత ఘనమైన రికార్డు సృష్టించవచ్చు.ఈ విజయం అతని కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదేవిధంగా, భారత్ జట్టు విజయానికి కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను నిలబెట్టుకుంటే, జట్టు విజయానికి దోహదపడటమే కాకుండా సచిన్ రికార్డును బ్రేక్ చేసే చాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.సచిన్ టెండూల్కర్-10 ఇన్నింగ్స్‌లలో 449 పరుగులు.అజింక్యా రహానే – 6 ఇన్నింగ్స్‌లలో 369 పరుగులు. విరాట్ కోహ్లీ-316 పరుగులు (ఇంకా కొనసాగిస్తున్నారు).ఈ రికార్డు వేటలో విరాట్ కోహ్లీ విజయం సాధిస్తాడా? లేదా? అనే ప్రశ్నకు అభిమానులు మరికొన్ని రోజుల్లో జవాబులు తెలుసుకుంటారు.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.