📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది

Author Icon By Divya Vani M
Updated: January 6, 2025 • 9:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆసక్తికరంగా ముగిసింది.ఆతిథ్య ఆస్ట్రేలియా 3-1 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. దీనితో ప్రతి టెస్ట్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.కొందరు కొత్తగా అరంగేట్రం చేస్తే, మరికొందరు సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశారు.అయితే, జట్టులో భాగంగా ఉన్నప్పటికీ ఒక టెస్టు మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ముగ్గురు ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, తనుష్ కోటియన్.ఈ ముగ్గురికి ఆడే అవకాశం రాకపోయినా వారి త్రెషరీ ఖాతా మాత్రం ఖాళీ కాలేదు.బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, జట్టులో భాగమై బెంచ్‌వార్మింగ్ చేస్తే మ్యాచ్‌ ఫీజుగా రూ.7.5 లక్షలు అందుకుంటాడు.ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటే, ఈ ఫీజు రూ. 15 లక్షలుగా ఉంటుంది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది

ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ మొదటి నుంచి జట్టులో భాగంగా ఉన్నారు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు.రావిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత, జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఏర్పడడంతో తనుష్ కోటియన్‌ను చివరి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేశారు.కానీ అతనికి ఆడే అవకాశమొచ్చింది కాదు.ఈ సిరీస్‌లో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు టెస్ట్ అరంగేట్రం చేసి తమ ముద్ర వేశారు.అలాగే,దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణలకి ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది.ఇదే సమయంలో, బెంచ్‌పై ఉండి కూడా సర్ఫరాజ్, అభిమన్యు, తనుష్‌లు మంచి ఆదాయం పొందారు. గతేడాది బీసీసీఐ టెస్ట్ ప్రోత్సాహక పథకం ద్వారా ఫీజులను పెంచింది. 50 శాతం మ్యాచ్‌లు ఆడే ఆటగాడికి రూ. 30 లక్షలు, నాన్-ప్లేయింగ్ ఎలెవెన్ సభ్యుడికి రూ.15 లక్షలు అందుతుంది. అలాగే, 75 శాతం మ్యాచ్‌లు ఆడే ఆటగాడికి రూ. 45 లక్షలు, ఆడని వారికి రూ. 22.5 లక్షల ప్రోత్సాహకం అందుతుంది.

Border Gavaskar Trophy Cricket News India vs Australia Indian Cricket Team Sarfaraz Khan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.