దక్షిణాఫ్రికా క్రికెటర్లతో భారత్ కెప్టెన్ గొడవ పరుగెత్తుకొచ్చిన అంపైర్లు

Read Time:  1 min
Suryakumar Yadav Fight 1731121714308 1731121714559
Suryakumar Yadav Fight 1731121714308 1731121714559
FONT SIZE
GET APP

డర్బన్ వేదికగా భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఒక దశలో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ మరియు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో, సంజు శాంసన్ డేంజర్ జోన్‌లో అడుగుపెట్టడంతో మార్కో జాన్సెన్ ఆగ్రహించాడు. డేంజర్ జోన్‌లో ఎందుకు అడుగు పెడుతున్నావ్ అంటూ జాన్సెన్ ప్రశ్నించగా, సంజు తర్జనభర్జన పడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా సంజు మీద కాంట్రవర్సీ పెంచే ప్రయత్నం చేశారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సంఘటనలో తన సహచరుడికి మద్దతుగా నిలిచాడు. సూర్య అందులోకి దిగిపోయి, జాన్సెన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. మీలాంటి ప్లేయర్లు ఇలా చేయకూడదు. ఇలాంటివి ఉంటే అంపైర్లకి చెప్పండి, అంటూ జాన్సెన్‌తో తిట్టాడు.

సూర్య వచ్చి నిలబడగానే, వాగ్వాదం మరింత ఎక్కువైంది. వేరే ఎండ్ లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాటర్ గెరాల్డ్ కూడా వచ్చి వాదనలో పాల్గొన్నాడు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం పీక్స్ కి చేరుకోవడంతో ఫీల్డ్ అంపైర్లు పరుగు తీసుకుని వచ్చి శాంతిపజేశారు. కానీ ఈ సంఘటన మ్యాచ్‌లో ఉన్నవారందరికీ తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. ఆట కొనసాగుతూ ఉండగా, సూర్యకుమార్ యాదవ్ తన చర్యలతో బదులిచ్చాడు. మొదట జాన్సెన్‌ని రవి బిష్ణోయ్ ఔట్ చేయగా, గెరాల్డ్‌ని సూర్య రనౌట్ చేయడం ద్వారా ఆటలోనే తన తీరును చూపించాడు. ఈ ఇద్దరి వికెట్ల కోల్పోవడం, దక్షిణాఫ్రికా టీమ్‌కి మరింత ఒత్తిడిని కలిగించింది.

భారత జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ మైదానంలో ఒక నాయకునిగా బాధ్యతగా వ్యవహరించాడు. ఇలాంటి గొడవల్లో ఫీల్డులో గొడవ పడటం చాలా అరుదైన విషయం. తన సహచరుడు సంజు శాంసన్ పై జాన్సెన్ కావాలనే దూషణ చేయడంతో సూర్య సహనం కోల్పోయాడు. ఈ చర్యతో తన జట్టుకు మద్దతుగా నిలవడం ద్వారా తన కెప్టెన్సీ బాధ్యతను నిర్వర్తించాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 50 బంతుల్లో 107 పరుగులు సాధించి, భారత్ జట్టుకు పటిష్టమైన స్కోరుని అందించాడు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి లోనై 141 పరుగులకే ఆలౌట్ కావడంతో, భారత్ ఈ మ్యాచ్‌ని 61 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే మ్యాచ్‌లో సూర్య సీరియస్‌గా జాన్సెన్‌తో వాదించడంపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తే, సూర్యపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయం అందరికీ ఆసక్తిగా మారింది.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జాన్సెన్‌తో వాగ్వాదానికి దిగడం అతని మామూలు ప్రవర్తన కాదని అభిమానులు అంటున్నారు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఈ గొడవను మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తే, సూర్యకుమార్‌కు అధికారిక మందలింపు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. సీరియస్‌గా ఫిర్యాదు చేయకుండా, ఈ విషయాన్ని ఆటలోని ఉద్వేగాలుగా భావిస్తే, అతనిపై ఎలాంటి చర్య తీసుకునే అవసరం ఉండకపోవచ్చు. వివాదంపై ఎలాంటి నిర్ణయం వస్తుందో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.