కంచ గచ్చిబౌలి భూముల వివాదం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది తాజాగా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. ఆమె షేర్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటోపై పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భూముల విషయమై చట్టప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఆయా భూములు ప్రభుత్వానికి చెందినవేనని కోర్టు కూడా ధృవీకరించిందని తెలిపారు దీనితో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. నకిలీ ఫొటోలు, వీడియోల వల్ల ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంకా విచారణలో ఉన్న విషయాలపై మాట్లాడటం సరికాదని అన్నారు.

ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంతేకాదు తెలంగాణ బీజేపీ నేతలు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. వారి ప్రోపగండా వల్లే ప్రధాని మోదీ కూడా గచ్చిబౌలి భూముల గురించి తప్పుగా మాట్లాడినట్లుగా విమర్శించారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమన్నారు. మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నట్లు తనకు అనుమానం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేళ్లా గద్దలుగా నెగిటివ్ ప్రచారం చేసి, విశ్వాసాన్ని దెబ్బతీసే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం శక్తివంతంగా ఉంది, ఇలాంటివాళ్లతో ఊగిపోతుందని భావించవద్దని చెప్పారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమైన ప్రక్రియ అని ఒక ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. దీనిని రకరకాలుగా వక్రీకరించడం సరైంది కాదన్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి. కానీ మంత్రుల స్టేట్మెంట్లు, అధికారుల స్పందనలు చూస్తే… రాజకీయంగా ఇది పెద్ద హంగామా సృష్టించేదిగా కనపడుతోంది.