పాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శిఖర్ ధవన్

పాక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శిఖర్ ధవన్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌లో పర్యటించకూడదన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించాడు. క్రికెట్ కంటే దేశ భద్రతే ముఖ్యమని స్పష్టం చేశాడు. ‘పాకిస్థాన్‌లో భారత జట్టు ఆడాలని మీరు అనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు ధవన్ మాట్లాడుతూ అలా అనుకోవడం లేదని, దేశ వైఖరికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లకూడదని పేర్కొన్నాడు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధవన్ స్పష్టం చేశాడు. తొలుత ప్రభుత్వాలు ఒక మాటపై ఉండాలని, ఆ తర్వాత అది క్రికెట్ బోర్డుకు వర్తిస్తుందని ధవన్ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆటగాళ్లకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని దేశం నిర్ణయిస్తే దానికి తాము కట్టుబడి ఉంటామని వివరించాడు.

Advertisements
afo4cus shikhar dhawan afp 625x300 23 July 22

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో పర్యటించడాన్ని భారత జట్టు ఎప్పుడో రద్దు చేసుకుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ వచ్చేవారం ప్రారంభం కానుంది. అవసరమైతే టోర్నీ నుంచి వైదొలగేందుకు కూడా సిద్ధపడిన భారత జట్టు పాక్ వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.కాగా, అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ధవన్ 167 వన్డేలు ఆడాడు. 44.1 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 34 టెస్టుల్లో 40.6 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక, 68 టీ20లు ఆడిన ధవన్ 27.9 సగటు, 11 అర్ధ సెంచరీలతో 1,759 పరుగులు చేశాడు.

ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా

ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, అది క్రికెట్ బోర్డుపైనా వర్తిస్తుంది. ఆటగాళ్లకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దేశం ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు ఆటగాళ్లు కట్టుబడి ఉంటారు, అని స్పష్టం చేశాడు.

క్రికెట్ లెక్కలు కంటే దేశ భద్రతే ముఖ్యం

ధవన్ వ్యాఖ్యలు దేశ భద్రతపై ఆయనకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. క్రికెట్ క్రీడకారుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ధవన్, దేశ ప్రయోజనాలను ఎప్పుడూ ముందు నిలుపుతానని చెప్పాడు.


పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడాలా,అనే ప్రశ్నకు
ప్రస్తుత పరిస్థితుల్లో అలా అనుకోవడం లేదు. భద్రతకే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉగ్రవాదం పూర్తిగా ముగిసే వరకు పాక్‌తో సాధారణ క్రీడా సంబంధాలు తిరిగి ప్రారంభించడం కష్టమే అని చెప్పడం గమనార్హం.

అభిమానుల స్పందన

ధవన్ వ్యాఖ్యలపై అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది దేశ భద్రత ముందు అని ధవన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొంతమంది క్రీడను రాజకీయాల నుంచి విడదీసుకోవాలంటున్నారు.శిఖర్ ధవన్ చేసిన వ్యాఖ్యలు స్ఫష్టంగా భారత ప్రభుత్వ, బీసీసీఐ వైఖరికి మద్దతుగా ఉన్నాయి.

Related Posts
ప్యాట్ క‌మిన్స్‌ కీలక వ్యాఖ్యలు!
ప్యాట్ క‌మిన్స్‌ కీలక వ్యాఖ్యలు!

భద్రతా కారణాల వల్ల బీసీసీఐ భారత జట్టును పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పంపించేందుకు నిరాకరించింది. దీంతో, ఐసీసీ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు నిర్ణయించింది, అందులో Read more

Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది
Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. డెవలప్‌మెంట్ పేరుతో ఆలయాన్ని తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, Read more

యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని
Prime Minister Modi dedicated warships to the nation

ముంబయి: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై.. Read more

చెన్నై కొత్త బౌలర్‌ను చితక బాదిన పాండ్యా..
hardik pandya smashed 29 runs in gurjapneet singh over

2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆడాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. Read more

Advertisements
×