పుణేకు చెందిన 22 ఏళ్ల లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి అరెస్టు (Sharmishtha Panoli arrested), దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. “ఆపరేషన్ సిందూర్” పేరుతో ఓ మతంపై విమర్శలు చేస్తూ వీడియో పోస్ట్ చేయడమే కారణం.ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. ఆమెపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ (Wajahat Khan) అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం అతనిపై కూడా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.వజాహత్ ఖాన్ కూడా సోషల్ మీడియాలో దేవుళ్లను, సంప్రదాయాలను అవమానించే విధంగా పోస్టులు చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై పశ్చిమ బెంగాల్, అసోం, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.కేసు నమోదు తర్వాత పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ వజాహత్ మాత్రం పరారీలో ఉన్నాడు.
బెదిరింపులే పరారికి కారణం?
వజాహత్ తండ్రి సాదత్ ఖాన్ స్పందించారు. కొందరి నుంచి తీవ్ర బెదిరింపులు వచ్చాయని, అందుకే కుమారుడు పారిపోయాడని తెలిపారు. పోలీసులు దీన్ని కూడా దర్యాప్తులో భాగంగా తీసుకున్నారు.
మొదటి ఫిర్యాదు ఎలా వచ్చిందంటే…
వజాహత్ ఖాన్ కోల్కతాలోని రషీది ఫౌండేషన్ కు కార్యదర్శిగా ఉన్నాడు. శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ అనే సంస్థ, వజాహత్పై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.వీడిన పదజాలం, పోస్టుల్లో మత విరుద్ధ వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శర్మిష్ఠను అరెస్టు చేస్తే, వజాహత్ ఎందుకు కాదు?
శర్మిష్ఠను పోలీసులు 1,500 కిలోమీటర్లు ప్రయాణించి అరెస్టు చేశారు. అదే విధంగా వజాహత్ ఖాన్ను కూడా వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. ఆన్లైన్లో మతాన్ని అవమానించడంలో ఎవరు అయినా సమానమే కదా?
Read Also : Shashi Tharoor : చైనాపై శశిథరూర్ ఆగ్రహం