Sharmila's anger over AP budget

ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మిషన్, విజన్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తిగా పక్కన పెట్టడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

Advertisements
Caste census should be conducted in AP too.. YS Sharmila

కేంద్రం పై ఆధారపడింది

రైతులకు, విద్యార్థులకు, మహిళలకు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించకుండా, కేంద్రంపై ఆధారపడేలా చేయడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి సరిపడా నిధులు లేకపోవడం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలకూ కోత విధించడం విద్యా రంగానికి నష్టమని పేర్కొన్నారు. అలాగే, ‘దీపం-2’ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం ఏంటి..?

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం, మహిళా ఆర్థిక సాధికారత కోసం ‘మహాశక్తి’ పథకాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ కాలెండర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా, 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. అంతేగాక, రాజధాని అమరావతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అప్పులతోనే నిర్మించాలని భావించడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అసమతుల్యతలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగలవని ఆమె హెచ్చరించారు.

Related Posts
ముస్లిం సోదరులకు ఏపీసర్కార్ గుడ్న్యూ స్
ముస్లిం సోదరులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ముస్లిం సోదరులకు కీలకమైన గౌరవ వేతనాల ప్రకటన రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ముస్లిం సోదరులకు కీలకమైన గౌరవ వేతనాల ప్రకటన చేసింది. Read more

చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న spedex..
చివరి నిముషంలో టెన్షన్ పెట్టిస్తున్న spedex..

ఇస్రో డిసెంబర్ 30న రాత్రి 10 గంటలకు శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్ నుంచి స్పాడెక్స్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్‌లో రెండు వ్యోమనౌకలు — SDX01 (చేజర్) Read more

సాంకేతిక లోపం..నిలిచినపోయిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు
Technical error.Hyderabad metro trains stopped

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం మెట్రోలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Read more

2024 యుపీ బైపోల్ ఫలితాలు: బిజేపీ 6 స్థానాల్లో ఆధిక్యం
bjp

2024 లోక్‌సభ ఎన్నికల్లో కొంత నిరాశను అనుభవించిన తర్వాత, యుపీలో బిజేపీకి బలమైన తిరుగుబాటు కనిపిస్తోంది. అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాల ప్రకారం, బిజేపీ పార్టి తొలుత Read more

Advertisements
×