హైదరాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. ఇటీవల భద్రతా కారణాలతో అధికారులు బందోబస్తును మరింత బలపరిచారు.కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) 24 గంటల పర్యవేక్షణ చేపట్టింది. లోపల, బయట ఏర్పాటైన సీసీ కెమెరాలతో ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఏ చిన్న అనుమానాస్పద శబ్దానికైనా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు.విమానాశ్రయ భద్రత కోసం పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్లతో సమన్వయం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.విమాన ప్రయాణం చేసేవారు కనీసం మూడు గంటల ముందే రావాలి. విమానాశ్రయం గేట్లు వద్ద కఠిన తనిఖీలు జరుగుతాయి.

ప్రయాణికుల లగేజీ కూడా పూర్తిగా స్కాన్ చేయబడుతుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు పాటిస్తున్నారు.భద్రతా కారణాల వల్ల కొన్ని నార్త్ ఇండియా విమాన సర్వీసులు నిలిపివేశారు. శ్రీనగర్, అమృత్సర్, జోధ్పుర్, చండీగఢ్, రాజ్కోట్కి వెళ్లే విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి.ప్రయాణికులు తమ విమాన సమాచారం కోసం ఎప్పటికప్పుడు airline వెబ్సైట్లు చూడాలి. ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే అప్డేట్ అవుతారు. ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా కూడా సమాచారం అందుతోంది.శంషాబాద్ పోలీస్, సీఐఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి అనుకోని ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also : Hyderabad: ఉద్యోగం ఇచ్చిన సంస్థకే ఎసరు ఇంతకీ ఎం చేసాడంటే?