టీచర్ ను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

టీచర్ ను చంపేందుకు స్కెచ్ వేసిన విద్యార్థులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిల్సాపూర్ లో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ టీచర్‌ను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా పేలుడు సంభవించే రసాయనాల గురించి తెలుసుకుని, వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించారు.

పగ తీర్చుకునేందుకు పథకం

విద్యార్థులంతా తమ టీచర్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సోడియం నాబ్ అనే రసాయనాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. నీటితో మిళితం చేయగానే భారీ పేలుడు సంభవిస్తుందని తెలుసుకున్న వారు, స్కూల్ వాష్ రూమ్‌ లో నీటితొట్టెలో సోడియం నాబ్ పోశారు. అయితే అనుకోకుండా టీచర్ స్థానంలో నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి వాష్ రూమ్‌ కి వెళ్లి ఫ్లష్ నొక్కడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సీసీ ఫుటేజ్

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. స్కూల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఐదుగురు విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి 23న నలుగురిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది.

empty schooljpg 1740467098687

ప్రమాదకర రసాయనాలు

పోలీసుల దర్యాప్తులో నిందితుల్లో ఒక విద్యార్థి తన కుటుంబసభ్యుల ఖాతా ద్వారా సోడియం నాబ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులకు అది అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.ఏ షాపు లేదా ల్యాబ్‌లో ఈజీగా అందుబాటులో ఉండవు. వాటి అమ్మకం, కొనుగోలు కోసం కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడంతో అది వారికి చేరింది. ఈ విషయాన్ని నోట్ చేసుకున్నాం.. పరిష్కారం దిశగా ఆలోచిస్తాం” అని స్థానిక ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. విద్యార్థులను ఎవరైనా బయటి వ్యక్తి ప్రేరేపించారా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. అందరు విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ఇప్పటికే పోలీసులు విద్యార్థులని విచారిస్తున్నారు. వారు స్వతంత్రంగా ఈ హత్యాయత్నం చేయాలని నిర్ణయించుకున్నారా? లేక ఎవరైనా బయట వ్యక్తులు ప్రేరేపించారా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. స్కూల్ మేనేజ్‌మెంట్, తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీస్‌పై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Posts
వీడు తండ్రి కాదు కామభూతం జీవితాంతం చిప్పకూడే
crime news

కేరళలోని కన్నూరులో జరిగిన ఓ అత్యంత విషాదకరమైన కేసు సాంఘికం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది.కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో, తండ్రి తన కుమార్తెను Read more

Meerut Murder Case: మీరట్‌ కేసులో వణుకుపుట్టిస్తున్న విషయాలు
Meerut Murder Case: మీరట్‌ కేసులో వణుకుపుట్టిస్తున్న విషయాలు!

మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసుల విచారణలో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె Read more

Prabhas: ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు..అసలు ఏంజరిగిందంటే..!
Prabhas: ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు..అసలు ఏంజరిగిందంటే..!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ,ది రాజా సాబ్ షూటింగ్ పూర్తికావొచ్చింది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో Read more

Nandyal: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
nandyal district

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నంద్యాల ఎస్పీ అంద్జిత రాజ్ సింగ్ రాణా ఘటన స్థలాన్ని Read more