CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI

Read Time:  1 min
CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI
FONT SIZE
GET APP

ప్రభుత్వ అవినీతి అధికారులపై విచారణ జరిపే కేంద్ర సంస్థలే (ED) ఇప్పుడు అవినీతి ఆరోపణలకు లోనవుతున్నాయి. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ (Chintan Raghuvanshi) ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.20 లక్షలు తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రూ.5 కోట్లు డిమాండ్.. రూ.2 కోట్లకు డీల్

సీబీఐ ప్రకారం, చింతన్ రఘువంశీ ఓ వ్యాపారవేత్తపై ఉన్న PMLA (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కేసును సెటిల్ చేయడానికి, అలాగే ఈడీ కేసు నమోదు కాకుండా చూడటానికి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. వ్యాపారవేత్తతో సాగిన చర్చల తరువాత, చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. మొదటి భాగంగా ఇచ్చిన రూ.20 లక్షల మొత్తాన్ని స్వీకరిస్తుండగా సీబీఐ అధికారులు తనిఖీలు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రశ్నలు

ఈ ఘటనతో కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అవినీతి కేసులను విచారించే అధికారులే లంచం తీసుకుంటూ కనిపడటం విచారకరం. ఇప్పటికే రాజకీయ వర్గాలు ఈ ఘటనను రాజకీయ ఆయుధంగా మలుచుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీబీఐ చింతన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదే సమయంలో ఇతర సంబంధిత అధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది.

Read Also : Maria Carolina : ప్రమాదం నుంచి బయటపడిన ఇటలీ యువరాణి

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.