టీమిండియా విధ్వంసకర బ్యాట్స్మన్గా పేరుగాంచిన రింకూ సింగ్ (Rinku Singh) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)గా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన విద్యార్హతలు కేవలం 9వ తరగతి వరకు మాత్రమే ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఒక విద్యా సంబంధిత కీలక పదవిని అత్యంత తక్కువ విద్యార్హతలతో కలిగిన వ్యక్తికి ఎలా అప్పగించగలిగారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అర్హతలపై ప్రధాన అభ్యంతరం:
బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఒక జిల్లాలోని ప్రాథమిక విద్య వ్యవస్థకు నిర్వాహకుడి పాత్రలో ఉంటాడు. అయితే రింకూ సింగ్ కేవలం 9వ తరగతి మాత్రమే పాస్ కావడంతో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నియామకంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రింకూ సింగ్ విజయాలను దృష్టిలో ఉంచుకొని క్రీడా కోటా కింద ఆయనను నియమించారు. దీనిపై విద్యా శాఖ డైరెక్టరేట్ మాట్లాడుతూ అంతర్జాతీయ పతక విజేతల ప్రత్యక్ష నియామక నియమావళి-2022 ప్రకారం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నియామకం జరిగిందని తెలిపింది. ఇప్పుడు మెడికల్, డాక్యుమెంట్స్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
సోషల్ మీడియా స్పందనలు – నెటిజన్ల మండిపాటు:
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ, దీంతో వారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. “ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ తక్కువ చదువుకున్న వారే ఇప్పుడు అర్హులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. డిగ్రీ-శిక్షణ ఉన్నప్పటికీ నిరుద్యోగి లాఠీ దెబ్బలు తింటున్నారు. తక్కువ చదువుకున్నవారు అధికారి పదవికి అర్హులుగా నిరూపించుకుంటున్నారు” అని రాసుకొచ్చాడు. “ఆయనను క్రీడా మంత్రిని చేసి ఉంటే బాగుండేది.. 9వ తరగతి పాస్ అయిన వ్యక్తిని బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేయడం విద్యను అగౌరవపరచడమే” అని రాసుకొచ్చాడు.
రింకూ సింగ్ క్రికెట్ కెరీర్ దృష్టిలో ఉంచితే..
రింకూ సింగ్ ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్. 2023లో టీమిండియా తరఫున ఐర్లాండ్తో తన టీ20 అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో రింకూ సింగ్కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. దీనితో పాటు రింకూ సింగ్ ఈ సంవత్సరం ఇంగ్లాండ్ జట్టుపై తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో రింకూ సింగ్ బ్యాట్ నుంచి కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రింకూ సింగ్ భారత జట్టు తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ టీ20 మ్యాచ్లలో మొత్తం 546 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్థ సెంచరీలు ఉన్నాయి.
రింకూ సింగ్ వన్డే ఫార్మాట్లో టీమిండియా తరఫున తన అరంగేట్రం 2023లో దక్షిణాఫ్రికాపై చేశాడు. ఈ మ్యాచ్లో రింకూ సింగ్ బ్యాట్ నుంచి 17 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రింకూ సింగ్ భారత జట్టు తరఫున 2 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
Read also: Rishabh Pant: రిషబ్ పంత్ ఆటతీరుపై చాపెల్ ప్రశంసలు