Revanth Reddy.. Secret agreement with Modi.. Jagadishwar Reddy

రేవంత్ రెడ్డి.. మోడీతో రహస్య ఒప్పందం : జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌: రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ కీలక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..మోడీని కలసి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మెదలు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. మోడీ ఏజంట్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ బాంబ్‌ పేల్చారు. మోడీని కలసొచ్చాక కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ దాడి తీవ్రతరం చేశాడని చురలకు అంటించారు.

Advertisements
image

మోడీ భజన చేస్తూ..

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయితీ మోడీ ఏ టీం, మోడీ బీ టీం మాదిరి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మోడీతో రహస్య ఒప్పందం చేసుకుని వచ్చాడని వెల్లడించారు. రాహుల్ గాంధీకి అర్థం అవుతుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. మోడీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతదా ? మోడీ భజన చేస్తూ.. రేవంత్ బహిరంగంగా దొరికిపోతున్నాడన్నారు. పదవి, ఆస్తులు కాపాడుకోవటానికే రేవంత్ మోడీ భజన చేస్తున్నాడని ఆగ్రహించారు. హరీష్ రావుపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా?

కాగా, పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా? అని కేటీఆర్, హరీశ్ రావు, కవితపై మండిపడ్డారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రధాని మోడీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రాలేదు.. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోడీనేనా అని రేవంత్ ప్రశ్నించారు.

Related Posts
ఫాస్టాగ్ కొత్త నిబంధనలు
ఫాస్టాగ్ కొత్త నిబంధనలు

టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషణ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బ్లాక్ Read more

దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే ప్రయత్నంలో స్టాలిన్
దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే ప్రయత్నంలో స్టాలిన్

తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలలో ప్రజల జీవనహక్కులను రక్షించేందుకు ముఖ్యమంత్రి ముకుల్‌ స్టాలిన్‌ డీలిమిటేషన్ అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 2026లో జరిగే Read more

Riyadh: రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు
రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ శాంతి చర్చలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా, ఉక్రెయిన్ ‌ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సోమవారం రష్యాతోనూ చర్చలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లో సమగ్ర శాంతి ఒప్పందానికి ముందు, తక్షణ పాక్షిక Read more

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

×