గ్లోబల్ స్టార్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న రామ్ చరణ్కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని ప్రముఖ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఘన వేడుక కోసం చిరంజీవి, సురేఖ, ఉపాసన కలిసి లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్ లో అభిమానులు మెగా ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు.
మెగా ఫ్యామిలీకి ఘన స్వాగతం
లండన్ ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబానికి అభిమానులు అద్భుత స్వాగతం పలికారు. పూల హారాలు, నినాదాలతో అభిమానులు ఎక్కడ చూసినా సందడి చేశారు. చెర్రీ, చిరంజీవిలతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు
ఇక, తాజాగా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్లో మెగా అభిమానులు సందడి చేశారు. చిరు, చెర్రీలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన దగ్గరే కాదు విదేశాలలోనూ వీరి క్రేజ్ అదే స్థాయిలో ఉండడంతో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. లండన్లోని మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు
స్టార్ హీరోల బాటలో చెర్రీ
గతంలో మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు బొమ్మలు లాంచ్ కాగా, ఇప్పుడు ఆ జాబితాలో చెర్రీ కూడా చేరారు. ఇక, చరణ్ మైనపు విగ్రహం లాంచ్ అవుతుండడడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ది టాలీవుడ్ అభిమానులందరికీ గర్వకారణంగా మారింది.