రాఖీ పౌర్ణమి (Rakhi full moon) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మన సాంప్రదాయాల ఆనందానికి అద్దం పడుతుందని అన్నారు.రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు అని పవన్ చెప్పారు. అది అక్కచెల్లెళ్ళు–అన్నదమ్ముల మధ్య ప్రేమకు గుర్తు అన్నారు. భావోద్వేగాలను పంచుకునే బంధానికి రాఖీ చిహ్నం అన్నారు.మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. మహిళల భద్రత, అభివృద్ధి పైనే తమ దృష్టి ఉందన్నారు. ప్రతి నిర్ణయంలో వారి మేలు దృష్టిలో పెట్టుకుంటామన్నారు.ప్రస్తుతం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విజయవంతమైంది అన్నారు. అలాగే ‘దీపం-2’ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ఈ పథకాలు మహిళలకి ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.

ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్ట్ 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు. ఇది మహిళలకు ఆర్థిక ఊరటనిస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇది ఉపయోగకరమని చెప్పారు.తాను ఎప్పుడూ మహిళల పట్ల గౌరవంతో ప్రవర్తిస్తానని పవన్ స్పష్టం చేశారు. “ఆడపడుచులకు నేనెప్పుడూ అండగా ఉంటాను” అన్నారు. తమ ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తుందన్నారు.
మహిళల భద్రత కోసం కట్టుబడి ఉన్నాం
సురక్షిత సమాజం కోసం మహిళల భద్రత అత్యవసరం అన్నారు. ప్రభుత్వంగా తమ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.తాను వేసే ప్రతి అడుగులో ప్రజల ఆశయాలే ముందుంటాయని పవన్ చెప్పారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి దారితీస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Read Also : YCP : EC ఆఫీస్ ఎదుట వైసీపీ నేతల మెరుపు ధర్నా