ఎపిఎస్ఎల్పిఆరిబి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా
విజయవాడ : పోలీసు కానిస్టేబుల్స్ నియామకాల కోసం రాత పరీక్షలో 33,921 మంది ఎంపికైనట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు రాజీవ్ కుమార్ మీనా (Rajiv Kumar Meena) తెలిపారు. గత నెల 1వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 37,600 మంది హాజరవగా, వీరిలో పురుషులు 32,364 మంది, మహిళలు 5,236 మంది ఉండగా, ఎంపికైన వారిలో పురుషులు 29,211 మంది, మహిళలు 4,710 మంది ఉన్నారని గురువారం విడు దల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా విశాఖపట్నం కేంద్రంలో 10,354, కాకినాడ కేంద్రంలో 5,502, గుంటూరు కేంద్రంలో 7,323, 6,320, తిరుపతి కేంద్రంలో 4,417 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. అభ్యర్థులు వారి మార్కుల జాబితాల కోసం https://slprb.ap.gov.in/UI/index వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

చెల్లించిన ఫీజును
అభ్యర్థులు వారి ఒఎంఆర్ షీట్లను పరిశీలించు కునేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ వెబ్సైట్లో (Website) అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఒఎంఆర్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని తెలిపారు. వెరిఫికేషన్లో మార్కులు పెరిగితే చెల్లించిన ఫీజును అభ్యర్ధికి వెనక్కి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ (E-Mail) ద్వారా పంపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, 94414 50639 లేదా 91002 03323 నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల లోపు సంప్రదించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా హరీష్ కుమార్ గుప్తా సర్ బాధ్యతలు స్వీకరించారు.
డీజీపీ (Director General of Police) జీతం ఎంత?
భారతదేశంలో డీజీపీ (DGP) స్థాయి అధికారి జీతం సుమారుగా ప్రతి నెలకు ₹2,25,000 ఉంటుంది. ఇది ఒక రాష్ట్ర పోలీస్ విభాగంలో ఐపీఎస్ అధికారికి లభించే అత్యున్నత హోదా.
Read hindi news: hindi.vaartha.com
Read Also: East Godavari District: లోకాయుక్త జోక్యంతో లైబ్రరీ సెస్ వసూలు