Rain Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రకు 3 రోజులు వర్షాలు

Rain Alert: ద్రోణి ప్రభావంతో ఆంధ్రకు 3 రోజులు వర్షాలు

ప్రస్తుతం భారతదేశం మీదుగా కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రజల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిని కలిగిస్తోంది.

Advertisements
Rain Alert:
Rain Alert:

ప్రస్తుత ద్రోణి, తెలంగాణ నుంచి తూర్పు మన్నారు గల్ఫ్‌ ప్రాంతం వరకూ కొనసాగుతూ, రాయలసీమ, దక్షిణ తెలంగాణ, తమిళనాడు మీదుగా వెళ్తోంది. ఇది సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీనివల్ల మేఘాలు ఏర్పడి గాలి తేమ పరవాహనం జరగడం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే 12వ తేదీకి దక్షిణ అండమాన్ సముద్ర ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

ఏపీలో మూడు రోజుల వర్షాలు – ఏఏ జిల్లాల్లో ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రాంతాలలో వర్షాలు జాగ్రత్త మరోవైపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఎండల తీవ్రత

ఎండల విషయంలోనూ అలెర్ట్ పిడుగుపాటు పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగు సమయంలో బయట ఉండరాదు, మొబైల్ ఫోన్ వాడకూడదు, చెట్ల కింద నిలవకూడదు. ఇక కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత పెరుగుతుందని 42 డిగ్రీల నుండి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లే వారు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం, కూలింగ్ ఉపకరణాలు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Read also: Andhra Pradesh: అమరావతి పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

Related Posts
Naa Anveshana: అన్వేష్ పై పోలీస్ కేసు నమోదు ఏం జరిగిందంటే?
Naa Anveshana: అన్వేష్ పై పోలీస్ కేసు నమోదు ఏం జరిగిందంటే?

ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన అన్వేష్, "నా అన్వేషణ" అనే యూట్యూబ్ సిరీస్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్‌ చేసేస్తూ Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఐటీ ప్రొఫెషనల్స్ ర్యాలీ

కార్మికుల మనస్తత్వంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనుకూలంగా ఐటీ ప్రొఫెషనల్స్ మద్దతు తెలియజేశారు. హైదరాబాద్‌లోని Read more

Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Hyderabad : (ఎల్.బి.నగర్) : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ పోలీసుల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×