Jammu and Kashmir : నేడు ఉగ్రదాడి ఘటన వద్దకు రాహుల్ గాంధీ

Read Time:  1 min
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
FONT SIZE
GET APP

Jammu and Kashmir : నేడు రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని రాహుల్ పరిశీలించనున్నట్టు సమాచారం అందుతోంది. అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాహుల్ గాంధీ కలవనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. అటు ఉగ్రదాడిపై నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉగ్రదాడిని ఖండించారు ఆల్ పార్టీల నేతలు. ఉగ్రవాదుల దాడి వివరాలను అఖిలపక్షానికి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

నేడు ఉగ్రదాడి ఘటన వద్దకు

ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రతిపక్షాలు పూర్తి మద్దతు

జమ్మూ కశ్మీర్‌ లో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు. అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నిఘా సంస్థల అధికారులు పాల్గొని, పహల్గామ్ దాడి పరిణామాలపై నేతలకు వివరించారు. సమావేశం అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఈ దాడిని ఖండించాయి. ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇస్తాయి” అని తెలిపారు.

పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు కొవ్వొత్తుల ర్యాలీలు

మరోవైపు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర, జిల్లా శాఖలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపాయి. ఇక, ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ కాల్పులు.. దీటుగా బదులిస్తున్న భారత్‌

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.