Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు

Read Time:  1 min
Raghurama Krishnaraju: జగన్ తో విభేదించడం వల్ల మనస్పర్థలు వచ్చాయి :రఘురామకృష్ణరాజు
FONT SIZE
GET APP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికై, అదే పార్టీ అధినేత అయిన జగన్‌ మోహన్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేసిన మొదటి నాయకుడిగా చరిత్రలో నిలిచారు ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై, ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్ధమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ జగన్ తో తనకు విభేదాలు ఎందుకొచ్చాయో వెల్లడించారు.

వైసీపీలోనే ఉండి జగన్‌ను ప్రశ్నించాను – రఘురామ

తాజాగా పాల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్‌, కోడెల శివప్రసాద్‌ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామ అక్కడ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై వైసీపీ నాయకులు చులకనగా మాట్లాడేవారని అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్ల జగన్ తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని రఘురామ తెలిపారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గుంటూరు నియోజకవర్గానికి చెందిన కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

Read also: TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన టీటీడీ ఛైర్మన్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.