అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేడు అహ్మదాబాదు కు వెళ్లనున్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆయన అహ్మదాబాద్ (Ahmedabad ) సివిల్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ప్రమాద స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్న ప్రధాని
ఆసుపత్రి సందర్శన అనంతరం, విమానం కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. భద్రతా అధికారులు ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలా సహాయం చేయాలో అవగాహన పొందేందుకు ఆయన ఈ పర్యటన చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ప్రధాని వెంట కేంద్ర, రాష్ట్ర మంత్రులు
ఈ పర్యటనలో ప్రధాని మోదీకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ లు కూడా ఉండనున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేయడంతో సహాయక చర్యలకు వేగం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఘటనా ప్రాంతం మరియు ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also : Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!