PM Modi is playing with tiger cubs in Vantara

వంతారాలో పులి పిల్లలను ఆడిస్తున్న ప్రధాని

అహ్మదాబాద్‌: వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గిర్‌ అడవుల్లో సఫారీకి వెళ్లారు. ఇవాళ జామ్‌నగర్‌ లోని వంతారాను సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రిని, జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు.

Advertisements
వంతారాలో పులి పిల్లలను ఆడిస్తున్న

వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితం

అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడ సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దేశ, విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం ‘వంతారా’ ముఖ్య లక్ష్యం.

ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణం

ఈ క్రమమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా మోడీకి స్వాగతం పలికారు. అనంతరం అనంత్‌ అంబానీతో కలిసి ప్రధాని మోడీ వంతారా మొత్తం కలియదిరిగారు. వంతారా అనేది కృత్రిమ అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లో ఇది ఉన్నది. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.

Related Posts
మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

YSRCP: రెండు సభల్లో వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
YCP opposes Waqf Amendment Bill in both houses

YSRCP : వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. బుధవారం లోక్‌సభలో Read more

Balochistan : బలూచిస్థాన్లో భూకంపం
Earthquake in Balochistan

ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా Read more

పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI
పుష్ప 2 ఆదాయం, పన్ను వివరాలు వెల్లడించిన RTI

పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పన్ను చెల్లింపుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. సీపీఎం నాయకుడు Read more

Advertisements
×