ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన (TG) మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తెలంగాణ (TG) ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి.
సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Pics by s.sridhar