हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Golconda First Bonam: మొదలైన బోనాల ఉత్సవాలు..గోల్కొండ ఆలయంలో తొలి బోనం ఎందుకు?

Anusha
Golconda First Bonam: మొదలైన బోనాల ఉత్సవాలు..గోల్కొండ ఆలయంలో తొలి బోనం ఎందుకు?

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలలో బోనాలు ఒకటి. ఇది కేవలం భక్తి పరంగా కాక, సాంస్కృతికంగా, చారిత్రకంగా, నిలిచింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం, అప్పటి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచీ ఈ పండుగ మరింత ఘనతతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది.ఇక ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు (Bonalu) ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి తమను సల్లంగా చూడమని వేడుకుంటారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

ఈ ఏడాది బోనాల సంబురం జూన్ 26, గురువారం నాడే మొదలు కాగా జులై 24న బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగ సందర్బంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. మరి గోల్కొండ కోట (Golconda Fort) లోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు.ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది. ప్రాముఖ్యత ఏంటి వంటి వివరాలు మీ కోసం.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయం

ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. దీనిలో భాగంగానే గోల్కొండ జగదాంబిక ఆలయం (Jagadambika Temple) నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత జులై 13వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. వీటినే లష్కర్‌ బోనాలు అని కూడా అంటారు.

లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి

సికింద్రాబాద్‌లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 21వ తేదీన పాతబస్తీ (Patha Basthi) లోని లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.

గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు?

హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సుమారు 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు. సర్వాయి పాపన్న కరీంనగర్‌లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి. అలానే గోల్కొండ కోట (Golconda Fort) కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కుతుబ్‌షాహీలు సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి.

గోల్కొండ కోటలో

హైదరాబాద్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం, 1675లో కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా (Abul Hassan Tanisha) వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న, గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 600 వందల ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.

ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం

కుతుబ్‌షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషాకు ప్రత్యేక చరిత్ర ఉంది. మతసామరస్యం పాటించిన పాలకుడిగా, హిందువులకు కూడా మంచి పదవులు ఇచ్చిన రాజుగా చరిత్రకారులు ఆయనను పొగిడారు. అందుకు నిదర్శనమే మాదన్న (Maadanna) కు మంత్రి పదవి ఇవ్వడమే కాక, గోల్కొండలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడమని చరిత్రకారులు అంటున్నారు. అంతేకాక ఆయన పలు హిందువుల పండుగల్లో స్వయంగా పాల్గొనేవాడని చరిత్ర చెబుతుంది.

అమ్మవారికి తొలి బోనం సమర్పించే వారు

హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీల కాలం నుంచే బోనాలు నిర్వహిస్తుండగా అప్పటికే గోల్కొండ కోటలో కొలువైన అమ్మవారికి తొలి బోనం (First Bonam) సమర్పించే వారు. ఆ తర్వాతనే భాగ్యనగరంలో నెల రోజు పాటు బోనాల ఉత్సవాలు కొనసాగేవి. ఇన్ని వందల ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తూ తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నారు.

బోనాలు ప్రారంభమైన

ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు మొదలవుతాయి. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అలానే బోనాలు ప్రారంభమైన తర్వాత వచ్చే ప్రతి గురు, ఆదివారాలు అమ్మవారికి (Ammavariki) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాల తొలి రోజు పంచామృతాలతో అమ్మను పూజి చివరగా రోజు పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమం నిర్వహించడంతో బోనాలు ముగుస్తాయి.

Golconda First Bonam: మొదలైన బోనాల ఉత్సవాలు..గోల్కొండ ఆలయంలో తొలి బోనం  ఎందుకు?

Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870