ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సొల్యూషన్ ద్వారా ఫోన్పే యాప్ వినియోగదారులు తమ బ్యాంక్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు వంటి లావాదేవీలను మరింత సులభతరం చేసుకోవచ్చు.వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే, సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం కూడా లేదని ఫోన్పే తెలిపింది. టోకనైజ్డ్ కార్డులను ఫోన్కు సురక్షితంగా అనుసంధానించడం వల్ల మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఆన్లైన్ చెల్లింపులపై భరోసా పెరుగుతుంది.

టోకనైజేషన్ అంటే ఏమిటి?
టోకనైజేషన్ అనేది కార్డు భద్రతను మెరుగుపరిచే సాంకేతికత. దీనిలో, వినియోగదారుల కార్డు వివరాలను భద్రత పరంగా ఓ ప్రత్యేక టోకెన్గా మార్చి స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే, వినియోగదారుల అసలు కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్ వంటి సున్నితమైన వివరాలు స్టోర్ చేయబడవు. లావాదేవీల సమయంలో టోకెన్ను ఉపయోగించి చెల్లింపు చేయడం జరుగుతుంది.
ఫోన్పే వినియోగదారులకు ప్రయోజనాలు:
వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం వల్ల, లావాదేవీ సమయంలో అసలు కార్డు వివరాలు షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి లావాదేవీకి సీవీవీ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.టోకెనైజ్డ్ కార్డు వివరాలు ఫోన్పే అకౌంట్కు అనుసంధానించబడినందున, వేగంగా బిల్లులు చెల్లించవచ్చు.కార్డు వివరాలు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ట్రాన్సాక్షన్కు కొత్త టోకెన్ను ఉపయోగించే విధానం వల్ల, మర్చంట్ సైట్ లేదా యాప్లో అసలు కార్డు డేటా స్టోర్ చేయబడదు. ఇది వినియోగదారులకు భద్రతతో పాటు, గోప్యతను కూడా పెంచుతుంది.
ప్రారంభంలో వీసా కార్డులతో:
ప్రస్తుతం ఫోన్పే వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే టోకనైజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర నెట్వర్క్ కార్డుల కోసం కూడా ఈ ఫీచర్ను విస్తరించనున్నట్లు ఫోన్పే ప్రకటించింది. అలాగే, ఫోన్పే చెల్లింపు గేట్వే సేవలు అనుసంధానమైన ఆన్లైన్ వ్యాపారుల వద్ద కూడా వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు.
వినియోగదారులకు సూచనలు:
టోకనైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా, ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ను చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి.అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే బ్యాంకును సంప్రదించాలి.ఫోన్ను ఇతరులతో పంచుకోవద్దు, ప్రైవేట్ పిన్ లేదా ఫింగర్ప్రింట్ లాక్ సెట్ చేసుకోవాలి.
ఫోన్పే ఈ ఫీచర్ను ప్రవేశపెట్టిన సందర్భంగా, వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాముఖ్యమనిపేర్కొంది. టోకనైజేషన్ ఫీచర్తో వినియోగదారులకు మరింత సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందించగలమనే విశ్వాసం ఉంది. ఇకపై వినియోగదారులు తమ కార్డు వివరాలను మర్చంట్ ప్లాట్ఫార్మ్లపై నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు.