మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఒక వినూత్నమైన, కానీ కఠినమైన నిర్ణయాన్ని అమలు చేయనుంది. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతుండడంతో అధికారులు ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇండోర్ జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంక్ (Petrol station) వద్ద “నో హెల్మెట్ – నో పెట్రోల్” నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంటే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వారికి పెట్రోల్ ఇవ్వబడదు.ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుండడం, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతుండడం అధికారులను ఈ చర్య వైపు నడిపింది. సుప్రీం కోర్టు రోడ్డు భద్రతా కమిటీ (మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అధ్యక్షతన) నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ నియమాన్ని అమలు చేస్తున్నట్లు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. ఈ చర్య వల్ల ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం చర్యలు
భారత పౌర భద్రతా కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం ఈ పరిమితి ఆదేశాన్ని జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.జిల్లా యంత్రాంగం పెట్రోల్ బంక్ యజమానులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ (Helmet) లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ ఇవ్వకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. పెట్రోల్ బంక్ల వద్ద ఈ నియమాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి.ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను పాటించని బంకులకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, రూ. 5,000 వరకు జరిమానా, లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది.

రవాణా అధికారి ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం
ఇండోర్లో నిబంధనలు ఉల్లంఘనలు విపరీతంగా ఉండటం పట్ల మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కఠిన చర్యల ఆవశ్యకతను స్పష్టం చేసింది. ప్రాంతీయ రవాణా అధికారి ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలో సుమారు 16 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో సుమారు 21 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నందున.. రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం తప్పనిసరని అధికారులు భావిస్తున్నారు.ఈ కొత్త నిబంధన ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్ ధరించాలనే అవగాహనను, అలవాటును పెంచుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
పెట్రోల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
తక్షణ శక్తి ఉత్పత్తి,వాహనాల సులభ రవాణా,తక్కువ బరువున్న వాహనాలకు సమర్థవంతమైన ఇంధనం,నిల్వ చేయడం, రవాణా సులభం.
పెట్రోల్ వాడకం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
గాలి కాలుష్యం (కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విడుదల),పర్యావరణానికి హానికరం,గ్లోబల్ వార్మింగ్ పెరగడం,శ్వాసకోశ సమస్యలు, ఆరోగ్య సమస్యలు.ముడి చమురు వనరులు తగ్గిపోవడం (పరిమిత వనరులు)
Read hindi news : hindi.vaartha.com
Read Also: Donald Trump: పాకిస్తాన్ చమురు భారత్కు అమ్మకంపై ట్రంప్ ప్రకటన