peoples fires on the congre

గ్రామసభల్లో ప్రజాగ్రహం

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాపై అధికారులు చేపట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఎలా ప్రకటించిందంటూ ప్రజలు ప్రశ్నించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు, భూస్వాములకు పథకాలు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలా గ్రామాల్లో సభలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇదే క్రమంలో కేటీఆర్ సైతం కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందంటూ ట్వీట్ చేసారు.

Advertisements

మోసకారి కాంగ్రెస్ సర్కారుపై
ప్రజాతిరుగుబాటు మొదలైంది..

గ్యారెంటీల గారడీపై
జనగర్జన షురూ అయింది

అసమర్థ ముఖ్యమంత్రి
అసలు స్వరూపం బట్టబయలైంది

ఇక కాలయాపనతో కాలం సాగదు
అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు

ఈ దరఖాస్తుల దందా నడవదు
ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు

నమ్మించి చేసిన నయవంచనకు
నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు
అట్టుడికిన గ్రామసభల సాక్షిగా

గ్రామసభలా…ఖాకీల క్యాంప్ లా!?
సంక్షేమ పథకాల కోసమా..కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?

ఖాకీల దౌర్జన్యాలు..
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!

పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?

ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?
ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?

పోలీసుల నడుమ.. అంక్షల నడుమ..పథకాలకు అర్హుల గుర్తింపట!
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన!

జై తెలంగాణ అంటూ ట్వీట్ చేసారు.

Related Posts
ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు సీఎం శంకుస్థాపన..
CM Revanth Reddy laid the foundation stone for the new building of Osmania Hospital

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి శుక్రవారం Read more

పెరుగుతున్న ఎండలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
పెరుగుతున్న ఎండలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత: కోస్తా, తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జారీ అయిన Read more

కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
The helicopter crashed in M 1

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ Read more

RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష
RSS leaders

కేరళలో 19 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ హత్యకేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు 2005 అక్టోబర్ Read more

×