Pakistan plans cyber attack: ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో సైబర్ దాడికి పాక్ ప్లాన్

Read Time:  1 min
Pakistan plans cyber attack : ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో సైబర్ దాడికి పాక్ ప్లాన్
Pakistan plans cyber attack : ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో సైబర్ దాడికి పాక్ ప్లాన్
FONT SIZE
GET APP

డాన్స్ ఆఫ్ ది హిల్లరీ” (Dance of the hillary)వైరస్‌గా గుర్తించిన మాల్వేర్ వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ రూపంలో పంపిణీ అవుతోంది. ఒకసారి యాక్టివేట్ అయితే ఈ వైరస్, మొబైల్ లేదా కంప్యూటర్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుందని, బ్యాంక్ ఆధారాలతో సహా రహస్య డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Pakistan plans cyber attack : ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో  సైబర్ దాడికి పాక్ ప్లాన్
Pakistan plans cyber attack : ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో సైబర్ దాడికి పాక్ ప్లాన్


లింక్‌లను ఓపెన్ చేయోద్దు
భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటున్న భారత్ (India)మాస్టర్ ప్లాన్స్‌తో దిక్కుతోచని స్థితిలో దాయాది దేశం విలవిల్లాడుతోంది. భారీ ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నప్పటికీ, పాకిస్తాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడిని (Cyber crime) ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సైబర్ దాడులకు గురికావొద్దని ప్రజలను భారత్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద ఫైల్‌లు లేదా లింక్‌లను ఓపెన్ చేయోద్దంటూ ప్రజలను హెచ్చరిస్తూ నిఘా సంస్థలు హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసే అవకాశం
ఇస్లామాబాద్ వంటి ప్రధాన నగరాలతో సహా పాకిస్తాన్ (Pakistan) అంతటా ఉగ్రవాద కేంద్రాలపై భారత సాయుధ దళాలు దాడులను కొనసాగిస్తుండగా, పొరుగు దేశం ప్రతీకారంగా సైబర్ యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకారం, సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటా లక్ష్యంగా పలు మాల్వేర్లను వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ వాట్సాప్, ఇమెయిల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతున్నారు.
“డాన్స్ ఆఫ్ ది హిల్లరీ” వైరస్‌గా గుర్తించిన మాల్వేర్ వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ రూపంలో పంపిణీ అవుతోంది. ఒకసారి యాక్టివేట్ అయితే ఈ వైరస్, మొబైల్ లేదా కంప్యూటర్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుందని, బ్యాంక్ ఆధారాలతో సహా రహస్య డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ అనుమానాస్పద లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌ల ద్వారా వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా .exe తో వచ్చే ఫైల్స్ ఓపెన్ చేయోద్దని చెబుతున్నారు. అలాగే, అపరిచితుల నుంచి వచ్చే ఫైల్స్, తెలియని లింక్స్ క్లిక్ చేయడం లేదా ఓపెన్ చేయడం మానుకోవాలని అధికారులు వినియోగదారులను కోరుతున్నారు. భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయోద్దంటూ అధికారులకు సూచించారు. మరోవైపు, పాకిస్తాన్ సైనిక దురాక్రమణకు భారత్ తీవ్రంగా స్పందించింది. భారత సాయుధ దళాలు అనేక ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్ నగరాల్లో భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ ప్రభావంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ తమ దేశంలో లాక్‌డౌన్ విధించినట్లు సమాచారం.

Read Also : Pakistan: హై టెన్షన్ లో పాక్ ప్రభుత్వం.. ఎందుకంటే!

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.