పహల్గామ్లో (In Pahalgam) జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా ఆవేదన రేపింది. ఈ ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) స్పందిస్తూ, తన హృదయం కదలిపోయిందని తెలిపారు.అయన మాట్లాడుతూ–ఒక నవ వధువు, తన భర్త మృతదేహం పక్కన రోదిస్తున్న దృశ్యం నా మనసును కలచివేసిందని.ఈ సంఘటనను మర్చిపోవడం చాలా కష్టం, అని పేర్కొన్నారు.ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అనుపమ్, ఈ ఘటన ఎంత భయానకమో వివరించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడి చాలా దారుణమైనది. ఇదొక మానవీయ విషాదం, అని అన్నారు.అనుపమ్ ఖేర్, కశ్మీరీ పండితుల వ్యథను కూడా గుర్తుచేశారు. 1990లో కశ్మీరీ పండితులను మానవతా విరుద్ధంగా తరిమివేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఆ రోజు ఘటనలు నన్నెప్పటికీ వెంటాడతాయి, అని ఆయన చెప్పారు.ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో పర్యాటకం పెరిగిందని, శాంతి నెలకొంటోందనే నమ్మకం వచ్చిన తరుణంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.

భారత ప్రభుత్వ చర్యలను ఖేర్ సమర్థన
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం జరిపిన దాడులను అనుపమ్ ఖేర్ సమర్థించారు. మన సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం సమంజసం. ఇది అవసరమైన నిర్ణయం, అని వ్యాఖ్యానించారు.అంతేకాదు, మన భద్రతా బలగాలు చేసిన సాహసాన్ని ఆయన ప్రశంసించారు. “సైనికులు, నిఘా వర్గాలు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాయి. వాళ్లకు సెల్యూట్, అని అన్నారు.
జాతీయ స్థాయిలో స్పందన
పహల్గామ్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆవేశం వ్యక్తమవుతోంది. ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను తెలుపుతున్నారు. అనుపమ్ ఖేర్ మాటలు, ఈ విషాద ఘటనను మరింత గుర్తుకు తెచ్చాయి.ఈ దాడిలో నిర్దోషులైన పౌరులు ప్రాణాలు కోల్పోవడం క్షమించలేని నష్టం. బాధిత కుటుంబాలకు దేశం తోడుగా నిలవాలి. రాజకీయాలకు అతీతంగా మనం ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉందని అనుపమ్ పిలుపునిచ్చారు.అనుపమ్ ఖేర్ చివరగా అన్నారు –మన భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు. ఇది మానవతపై దాడి. దీని మూలాన్ని బలంగా నరికాల్సిన సమయం ఇది, అని స్పష్టంగా చెప్పారు.
Read Also : Boko Haram : నైజీరియాలో పాకిస్థానీయుల అరెస్ట్