2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ (Navodaya ) విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 654 నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం జూలై 29, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేదా ఇప్పటికే ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
ప్రవేశ పరీక్ష తేదీలు
ప్రవేశ పరీక్ష రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా సాధారణ రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025న పరీక్ష జరుగుతుంది. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం ప్రవేశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ ప్రాంతాన్ని అనుసరించి తగిన పరీక్ష తేదీకి సిద్ధంగా ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తు వివరాలు
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు https://cbseitms.rcil.gov.in/nvs వెబ్సైట్లోకి వెళ్లి జూలై 29, 2025లోపు దరఖాస్తు ఫారాన్ని పూరించాలి. అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే నవోదయ పాఠశాలల్లో ప్రవేశానికి ఇది మంచి అవకాశం. కనుక అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
Read Also : One Big Beautiful Bill : పెరగనున్న వీసా ఫీజులు