Nitin Gadkari : ఢిల్లీలోని వాయు కాలుష్యంపై నితిన్‌ గడ్కరీ ఆందోళన

Read Time:  1 min
Nitin Gadkari expresses concern over air pollution in Delhi
Nitin Gadkari expresses concern over air pollution in Delhi
FONT SIZE
GET APP

Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలో మూడ్రోజులుంటే జబ్బు చేయడం ఖాయమని అన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబయి రెడ్‌జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గుతుందని.. వైద్య పరిశోధనను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు.

 ఢిల్లీలోని వాయు కాలుష్యంపై నితిన్‌

పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు

పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమన్నారు. మనం దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని.. వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్న భారత్‌ రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడంపై దృష్టిపెడుతోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్‌ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే మన ఖర్చులు 16శాతం వరకు ఉన్నాయని.. 2026 చివరి నాటికి వాటిని సింగిల్‌ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి

రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏవిధంగా ప్రాధాన్యం ఇస్తామో అలాగే పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పని చేస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. కాగా, స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ‘ద వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్ 2024’ నివేదిక ఇటీవల విడుదలైంది. దీని ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.