దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి : ప్రధాని

Read Time:  1 min
Rozgar Mela.. PM Modi who gave appointment letters to 71 thousand people
Rozgar Mela.. PM Modi who gave appointment letters to 71 thousand people
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ “రోజ్‌గార్‌ మేళా” లో భాగంగా ఈరోజు 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖ‌లు అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాని మవ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మాట్లాడారు. గ‌త ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం యువ‌త‌కు సుమారు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలిపారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో, ప్రోగ్రామ్‌ల్లో త‌మ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక స్థానం క‌ల్పించింద‌న్నారు. పార‌ద‌ర్శ‌క‌త వ‌ల్లే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జ‌రిగిన‌ట్లు చెప్పారు.

రిక్రూట్ అయిన‌వారిలో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు తెలిపారు. వీలైనంత‌గా యువ‌త సామ‌ర్థ్యాన్ని, నైపుణ్యాన్ని త‌మ ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌న్నారు. అనేక స్కీమ్‌లు ప్రారంభానికి వాళ్లు కేంద్రంగా మారిన‌ట్లు తెలిపారు. 26 వారాల మెట‌ర్నిటీ లీవ్‌ను ఇవ్వ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు త‌మ కెరీర్‌లో ఎక్కువ లాభం జ‌రిగిన‌ట్లు ప్ర‌ధాని మోడీ చెప్పారు. పీఎం ఆవాస్ యోజ‌న కింద ఎక్కువ మంది ల‌బ్ధిదారులు మ‌హిళ‌లే అన్నారు. దేశంలో మ‌హిళా కేంద్రీకృత అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.