కర్ణాటక రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Kangana Ranaut : మీ బెదిరింపులు నా వద్ద పని చేయవు – కంగనా రనౌత్

ప్రథమ ప్రాధాన్యత
బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్ వ్యూహాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.”నాకు ముఖ్యమంత్రి పదవి గానీ, మరే ఇతర ఉన్నత పదవి గానీ ముఖ్యం కాదు. పార్టీలోని ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా పనిచేసి, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రధానం” అని శివకుమార్ (DK Shivakumar) అన్నారు.
అధికార పంపకాల గురించి ఏవైనా చర్చలు జరిగితే, అవి పార్టీ నాలుగు గోడల మధ్యే జరుగుతాయని, సరైన సమయంలో పార్టీ అధిష్ఠానమే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజలకు తావులేదని, ఇక్కడ పార్టీకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, తాను సామూహిక నాయకత్వాన్ని నమ్ముతానని ఆయన తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: