రాజకీయ ప్రస్థానంలో పదవీ విరమణ అనేది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, ప్రజా సేవలో ఎప్పుడూ విరామం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సభను వీడుతున్న వారు సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో జరిగిన చర్చలు, భిన్నాభిప్రాయాలు అన్నీ ప్రజాస్వామ్య బలాన్ని చాటుతాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో విలువైనదని, అది వృధా పోదని మోదీ భరోసా ఇచ్చారు.
Read also: AP Municipal Elections: మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
సీనియర్ నేతల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని
కొత్తగా ఎన్నికైన ఎంపీలు హెచ్డీ దేవెగౌడ, శరద్ పవార్, మల్లిఖార్జున ఖర్గే వంటి సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. దశాబ్దాల కాలం పాటు పార్లమెంటరీ సేవలో గడిపిన వీరి జీవితాలు యువ నాయకులకు మార్గదర్శకాలని కొనియాడారు. సభలో క్రమశిక్షణతో పాటు హాస్యం, వ్యంగ్యం కూడా అవసరమని, రాందాస్ అథవాలే వంటి వారు సభను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతారని ప్రశంసించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ గారు తీసుకున్న కఠిన నిర్ణయాలు, ఆయన పనితీరును కూడా ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
సభలో ఖర్గే చమత్కార మాటలు
ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనదైన శైలిలో చమత్కరించారు. దేవెగౌడ గారితో తనకున్న 54 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “ఆయన మమ్మల్ని ప్రేమించి, మోదీని పెళ్లి చేసుకున్నారు” అని అనడంతో సభలో నవ్వులు పూశాయి. రాజకీయాల్లో ఉన్నవారు అలసిపోరని, దేశం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన స్థానాలకు పోలింగ్ ద్వారా అభ్యర్థులు విజయం సాధించారు. పాత, కొత్త పార్లమెంట్ భవనాల్లో పనిచేసిన అరుదైన గౌరవం కొందరు సభ్యులకు దక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: