హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) బైపాస్ ప్రాంతం తెలంగాణ రాజకీయాల్లో తాజా హాట్ స్పాట్గా మారింది.దివంగత, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకస్మాత్తుగా మరణించడంతో, ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. అందుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని అధికార వర్గాలు ప్రకటించాయి.ల సోమవారం మధ్యలోనే అధికారిక నోటిఫికేషన్ బయటకు రావచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే స్థానిక రాజకీయ వర్గాలు గట్టిగా చర్చల్లో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ముందే సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున, మాగంటి గోపినాథ్ భార్య సునీత, ప్రచారంతో గట్టి హవా సృష్టించారు. ఆమె స్థానిక సమస్యలపై సజీవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సునీత సోషల్ మీడియాలో కూడా చురకనైన పద్ధతిలో ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీనియర్ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం
తాజాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలిసింది. నవీన్ కుమార్ యాదవ్ను బరిలోకి దించాలని హస్తం పార్టీ దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పార్టీలోని సీనియర్ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
బీసీ నినాదం కూడా కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్.. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ.. 2023 ఎన్నికల్లో టికెట్ పొందలేకపోయారు. కానీ, ఇప్పుడు ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు మార్గం సుగమమైందని ప్రచారం జరుగుతోంది.

తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దించబోమని
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్తో ఉన్న స్నేహ సంబంధాలను తెంచుకుని కాంగ్రెస్కు దగ్గరైంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) పలుమార్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 70 వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ సహకారాన్ని కోరుతోంది.
ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో ఉప ఎన్నిక ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. ఆ చర్చల్లోనే నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరు ఎంపిక గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం. మైనార్టీ నాయకుడికి కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని, తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దించబోమని అసదుద్దీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు తేలింది
అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అజారుద్దీన్ (Azharuddin) కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో నవీన్ పట్ల ఎక్కువ మంది ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు తేలింది. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: