తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని, ఈ మద్దతుతో ఇంకో 15 సంవత్సరాలు కూడా పార్టీ అధికారంలో కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy)అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో ఒక ప్రధాన పార్టీ అంతర్గతంగా విభేదాలతో చీలిపోయిందని, మరో పార్టీ ప్రజల్లో పూర్తిగా కనపడకుండా డిపాజిట్ కూడా కోల్పోయిందని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె, కుమారుడు, అల్లుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
Read Also: Vande Bharat: జనవరి 12 నుండి చెన్నై-నర్సాపురం వందే భారత్ సేవలు ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో ప్రతిపక్షాలు బలహీనపడ్డాయని విమర్శలు
సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి,(Komatireddy) కాల్వపల్లి వద్ద రూ.74 కోట్ల వ్యయంతో అవంతిపురం–శెట్టిపాలెం నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బీఎల్ఆర్ కూడా హాజరయ్యారు.
ప్రసంగంలో పాల్గొన్న కోమటిరెడ్డి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రూ.60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు రూ.10,410 కోట్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తల కఠిన శ్రమ వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: