Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జోగులాంబ గద్వాల నుంచే తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రానున్న MPTC, ZPTC స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.
Read Also:Eduru Venkanna: చలో సెక్రటేరియట్కు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు

రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె, నడిగడ్డ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా, తుంగభద్రా వంటి నదులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 2500 ఆర్థిక సహాయం హామీ అమలుకాలేదని ప్రశ్నించారు. సీడ్ పత్తి రైతులకు బకాయిలు వారం రోజుల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మహిళల పాత్ర లేకుండా వ్యవసాయం ముందుకు సాగదని ఆమె వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: