జూబ్లీహిల్స్ Jubilee Hills ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ వేడి చెలరేగింది. ఈ బైపోల్ పై మూడు ప్రధాన పార్టీల దృష్టి నిలిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించగా, అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను రంగంలోకి దించింది. కాంగ్రెస్ మొదటినుంచీ బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం ఈ ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా, బీజేపీ కూడా ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన ముఖ్యమైన సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, నాయకులు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్నకు అరుదైన గౌరవం

Jubilee Hills
జూబ్లీహిల్స్
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
“జూబ్లీహిల్స్ (jubilee Hills) సీటు గెలిచి ప్రధాని మోదీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి,” అని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని, ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
అతను ఇంకా మాట్లాడుతూ,
“బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని చెప్పి, విషాద నగరంగా మలిచారు,”
అని తీవ్రంగా విమర్శించారు.
వానలు పడితే నగరంలో రహదారులు దెబ్బతింటాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటు అని ఆరోపిస్తూ, ప్రధాని మోదీ తీసుకొస్తున్న కుల గణన (Caste Census) ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. Jubilee Hills రామచందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ మూడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పార్టీ సెంట్రల్ కమిటీకి పంపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: